Wednesday 9 December 2015

neeti pampakaalu.

క్రిష్ణా జలాల పంపకాలలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ మూడు రాష్ట్రాలకు కలిపి(మహారాష్ట్ర,కర్నాటక, ఉమ్మడి ఆంద్రప్రదేశ్)2578 టిఎంసిల వరకు పంపిణి చేసింది. ఇందులో 65% నీటి లభ్యత ఆదారంగా 2293 టిఎంసిలు గా నిర్ణయించింది. మిగిలిన 285 టిఎంసిలలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు 145 టిఎంసిలు వచ్చాయి. ఇందులో 25టిఎంసిలు తెలుగు గంగ కు ఇవ్వగా మిగిలినది 120 టిఎంసిలు. ఈ 120 టిఎంసిలను  మిగుల జలాల ఆదారంగా చేపట్టిన తెలంగాణలోని కల్వకుర్తి,శ్రిశైలం ఎడమ గట్టు కాలువ,నెట్టెంపాడు, ఆంద్రప్రదేశ్లోని వెలిగొండ,హంద్రీనీవ(రాయలసీమ),గాలేరు-నగరి(రాయలసీమ) ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగాల్సి ఉంది. సీమలో 40 టిఎంసిల నీటి వినియోగ లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న హంద్రీనీవ,38 టిఎంసిల లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న గాలేరు-నగరి ప్రాజెక్టులకు ఎన్ని టిఎంసిలు కేటాయిస్తారో వేచిచూడాలి.  

No comments:

Post a Comment