Friday 18 December 2015

అనంతపురం,చిత్తూరు జిల్లాల తాగునీటి సమస్యకు ఒక ప్రత్యామ్నాయం.

కిర్‌ణ్ కుమార్ రెడ్డి హయాంలో చిత్తూరుజిల్లా తాగునీటి కోసం కండలేరు జలాశయం నుండి 6.6 టిఎంసిలమంచి నీరు అందివ్వడానికి దాదాపు 6000కోట్ల రుపాయల అంచనా వ్యయంతో నిర్మాణానికి అడుగులు పడుతుండేవి. కానీ  చంద్రబాబు నాయుడు సిఎం అయిన తర్వాత ఆ ప్రాజెక్టును రద్దు చేసాడు.
               కృష్నా జలాల నుండి ఆంద్రప్రదేశ్,కర్ణాటక,మహారాష్ట్ర లకు కేటాయించిన జలాలలో ఒక్కొక్కరి నుండి 5 టిఎంసిలు చొప్పున మొత్తం 15 టిఎంసిలు చెన్నైకి ఇస్తున్నాము. మన ప్రభుత్వం ఆల్మట్టి నుండి 5 టిఎంసిల నీటిని ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించగలిగితే మనకు 5 టిఎంసిల నీళ్ళు మిగులుతాయి. ఈనీటిని అనంతపురం త్రాగునీటి అవసరాలకు, కండలేరు ప్రాజెక్టు నుండి 6 టిఎంసిల నీటిని చిత్తూరు జిల్లా వాసులకు ఇవ్వగలిగితే కనీసం ఈ రెండు జిల్లాల తాగునీటి అవసరాలను కొంతవరకైనా తీర్చవచ్చును.

No comments:

Post a Comment