Sunday 13 December 2015

తుంగభద్ర ప్రాజెక్టు: సీమవాసులకు జరుగుతున్న అన్యాయం.

1969లో 300 టిఎంసిల సామర్థ్యంతో పూర్తైన ఈ ప్రాజెక్టును 270 టిఎంసిల కు కుదించారు. అంతేకాక బచావత్ ద్వారా తుంగభద్ర  నీటిని పంచుకోవాల్సివచ్చినప్పుడు 65%నీరు కర్ణాటకకు 35%నీరు మనకు, 65% కరెంటు మనకు, 35% కరెంటు కర్ణాటకకు పంచుకోనేట్లు ఓప్పందం చేసుకున్నారు. 'మనకు నీల్లు అవసరం లేదు. వర్షాధారంతో పండించుకోవచ్చును. కానీ కరెంటు తో పరిశ్రమలు అభివృద్ధి చేసుకోని ఉపాధి సృష్టించుకోవచ్చనీ ఓవర్గం వాళ్ళు వాదించారు. ఏమో నిజమవ్వచ్చేమో అనే ఆశతో మనమూ మిన్నకుండిపోయాము. రాయలసీమకు మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ఏకైక ఆధరువుగా ఉన్న తుంగభద్ర నీటిని కరెంటు కోసం త్యాగం చేసేశాము. ఇక పరిశ్రమలంటారా......అలాంటి పెద్ద పెద్ద మాటలు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమం. మరో ప్రాంత కరెంటు కోసం మనము మన బతుకు(నీటిని) ను త్యాగం చేస్తున్నాము.

No comments:

Post a Comment